కోల్కతా: పశ్చిమబెంగాల్ ప్రభుత్వం, ఆ రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్కర్ మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అసెంబ్లీని మార్చి 7 నుంచి సమావేశపర్చాలని సీఎం మమతా బెనర్జీ పంపిన సిఫారసు లేఖను గవర్నర్ తిప్పి పంపారు. రాజ్యాంగ నిబంధనల మేరకు ఆ లేఖను మంత్రి వర్గం పంపలేదని ఆక్షేపించారు. ఇలా తిప్పి పంపడాన్ని టీఎంసీ తీవ్రంగా ఖండించింది.