యాదాద్రి: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం ఆలయానికి చేరుకున్న గవర్నర్ తమిళిసైకి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఆలయ ఈవో గీత స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గవర్నర్ తమిళిసైకి ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదం అందజేశారు.
అంతకు ముందు ప్రధానాలయ నిర్మాణాలను గవర్నర్ పరిశీలించారు. సుమారు అరగంట పాటు ప్రధానాలయం, మాడ వీధులు, గర్భాలయం, విమాన గోపురం పనులు, పరంజా పనులను పరిశీలించారు.