హైదరాబాద్ : రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్కు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఘన స్వాగతం పలికారు. ముచ్చింతల్లోని శ్రీరామనగరంలో జరుగుతున్న రామానూజచార్యుల సహస్రాబ్ది వేడుకలు జరుగుతున్న విషయం తెలిసిందే.
వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి హెలికాప్టర్లో ముచ్చింతల్కు బయలుదేరారు.
ఆ తర్వాత భద్రవేదిలోని మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన 120 కిలోల రామానుజాచార్యుల బంగారు విగ్రహ ఆవిష్కరించనున్నారు. ఆలయాలు, బృహాన్మూర్తి విగ్రహాన్ని సందర్శించనున్నారు. సాయంత్రం 4 గంటలకు స్వర్ణమూర్తి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. సాయంత్రం 5 గంటలకు వరకు ఉత్సవాల్లో పాల్గొంటారు.