న్యూఢిల్లీ, జనవరి 6: భారతీయులకు త్వరలోనే ఈ-పాస్పోర్టులను జారీ చేయనున్నట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి సంజయ్ భట్టాచార్య వెల్లడించారు. బయోమెట్రిక్ సమాచారాన్ని నిక్షిప్తం చేసే ఈ ‘ఈ-పాస్పోర్టు’లను అత్యంత భద్రతా ప్రమాణాలతో తయారు చేయనున్నట్టు పేర్కొన్నారు. అంతర్జాతీయ వలస విధానాలకు అనుగుణంగా ఇవి ఉండబోతున్నట్టు వివరించారు.