హైదరాబాద్ : రైతులకు సాగునీరు ఇవ్వాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి హరీశ్ రావు చేపట్టిన ఆందోళనకు రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. దేవాదుల ప్రాజెక్టులో 10 మోటర్లు ఆన్ చేసి రైతులకు సాగు నీరు అందజేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. రైతుల నుండి వస్తున్న వ్యతిరేకత నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టులో 9 మోటర్లు ఆన్ చేసింది. దీంతో సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ప్రస్తుతం సమ్మక్క సాగర్ ఇన్ ఫ్లో–40,200 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో–38,410గా ఉంది. మొత్తం 1790 క్యూసెక్కుల నీటిని అధికారులు ఎత్తిపోస్తున్నారు.
హరీష్ రావు ఒత్తిడితో దిగొచ్చిన తెలంగాణ ప్రభుత్వం
దేవాదుల ప్రాజెక్టులో 10 మోటర్లు ఆన్ చేసి రైతులకు సాగు నీరు అందజేయాలని డిమాండ్ చేసిన హరీష్ రావు
రైతుల నుండి వస్తున్న వ్యతిరేకత నేపథ్యంలో 5 మోటర్లు నడుస్తున్న దేవాదుల ప్రాజెక్టులో 9 మోటర్లు ఆన్ చేసిన ప్రభుత్వం
దీంతో సమ్మక్క సాగర్… https://t.co/PnNWiHxwyG pic.twitter.com/4O7tTaqE6I
— Telugu Scribe (@TeluguScribe) July 22, 2026