వికారాబాద్ : స్వయం సహాయక సంఘాల మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు సర్కారు ప్రోత్సాహం అందజేస్తుందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లాలోని పరిగిలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వీహబ్ను ఏర్పాటు చేసిందన్నారు.
గ్రామాలలో స్వయం సహాయక సంఘాల మహిళలు చిన్న వ్యాపారాలతో అభివృద్ధిచెందడానికి సర్కారు చేయూత ఇస్తుందని పేర్కొన్నారు. మోమిన్పేట్లో మహిళలు తమ పొలాల్లో పండించిన ఆలుగడ్డలను ప్రాసెసింగ్ చేసి మార్కెట్లో విక్రయించేందుకు ప్రభుత్వం ప్రోత్సహించగా వారు వ్యాపారంలో చక్కగా రాణిస్తున్నారని మంత్రి ప్రశంసించారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ టికెట్ను మహిళకు ఇచ్చి గెలిపించిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ పి.సునితారెడ్డి, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా, జెడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్, తదితరులు పాల్గొన్నారు.