చిక్కడపల్లి :ఉన్నత చదువులకు ప్రభుత్వం ప్రోత్సహం అందిస్తోందని రాష్ట్ర అబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
సోమవారం టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బాగ్లింగంపల్లిలోని పి.రాజేంద్ర ప్రసాద్ గౌడ్ నివాసానికి వెళ్లిన మంత్రి అమెరికాకు ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళుతున్న ఆయన కుమార్తె రిషితను ఘనంగా సత్కరించారు.రిషితకు మంచి భవిషత్తు ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పి.హర్షవర్ధన్ గౌడ్, హౌస్ ఫేడ్ డైరెక్టర్ అయిలినేని కిషన్రావు, మన్కె దామోదర్రెడ్డి, బబ్లూ, సంతోష్ గౌడ్, అంబాల నారాఆయణ గౌడ్, శ్రీనివాస్ ముదిరాజ్, టీఎన్జీఓ అధ్యక్షుడు ఎం.బి.కృష్ణయాదవ్, ఎ.సత్యనారాయణ, వెంకట్, వెంకటయ్య, సహదేవ్, డాక్టర హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.