న్యూఢిల్లీ, జనవరి 26: వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న సార్వత్రిక బడ్జెట్ తుది అంకానికి చేరుకున్నది. బడ్జెట్ ప్రతుల ముద్రణకు ముందు నిర్వహించే హల్వా వేడుక కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హల్వా గరిటే తింపారు. అనంతరం ఈ బడ్జెట్ను తీర్చిదిద్దిన ఉన్నతాధికారులుకు ఆమె హల్వాను అందించారు. కరోనా కారణంగా గతేడాది ఈ హల్వా వేడుకను నిర్వహించలేదు. నార్త్బ్లాక్లో నిర్వహించిన ఈ వేడుకు నిర్మలా సీతారామన్తోపాటు కేంద్ర సహాయ మంత్రులు పంకజ్ చౌదరీ, భగ్వత్ కే కారత్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. వీరిలో ఫైనాన్స్ సెక్రటరీ టీవీ సోమనాథన్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్, దీపం కార్యదర్శి తుహిన్ కే పాండే, రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రాతోపాటు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను సీతారామన్ వచ్చే నెల 1న సార్వత్రిక బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు.