కడ్తాల్, డిసెంబర్ 12 : పేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని కర్కల్పహాడ్ గ్రామానికి చెందిన మల్లయ్యకు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ సహ కారంతో రూ.లక్ష సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరైంది. ఆదివారం హైదరాబాద్లోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారుడికి ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పథకంతో నిరుపేదలకు కార్పొరేట్ దవాఖానల్లో అత్యుత్తమ వైద్యం అందుతున్నదని, ఈ పథకం ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిదని తెలిపారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. అర్హులు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకో బా, నాయకులు సత్తిరెడ్డి, పట్టాభిరాంరెడ్డి, వెంకట్రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ
ఆమనగల్లు మండల పరిధిలోని రాంనుంతల గ్రామ శివారులో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్కల్పహాడ్ గ్రామానికి చెందిన రాకేశ్తోపాటు అతడి బావమరిది యాదయ్య మృతి చెందారు. పోస్టుమార్టం అనంతరం ఆదివారం మధ్యాహ్నం రాకేశ్ మృతదేహాన్ని కర్కల్పహాడ్ గ్రామానికి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జైపాల్యాదవ్ స్థానిక నాయకులతో కలిసి రాకేశ్ మృతదేహంపై పూలమాలేసి నివాళి అర్పించారు. బాధిత కుటుంబానికి రూ.15 వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఆయన వెంట జడ్పీటీసీ దశరథ్నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, సర్పంచ్ నాగమణి, వెంకోబా, ఎంపీటీసీ లచ్చిరాంనాయక్, నాయకులు యాదయ్య, బీరయ్య, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
హయత్నగర్ రూరల్, డిసెంబర్ 12 : ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు అండగా నిలుస్తున్నది. అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని కుత్బుల్లాపూర్ గ్రామానికి చెందిన పీ సూర్యకళ అనారోగ్యంతో దవాఖానలో చేరింది. ఆమె చికిత్స కోసం సీఎంఆర్ఎఫ్ కింద ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. వైద్య సాయం కింద వచ్చిన చెక్కును సూర్యకళ కుటుంబానికి చెందిన శ్రీశైలానికి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అందజేశారు.
స్వచ్ఛంద సంస్థలు ముందుకు సాగాలి
ఇబ్రహీంపట్నంరూరల్ : స్వచ్ఛంద సంస్థలు సేవాభావంతో ముందుకుసాగి పేద ప్రజలకు సేవలందించాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. నవ్యఫౌండేషన్ 10 వార్షికోత్సవాన్ని ఫౌండేషన్ చైర్పర్సన్ మడుపు శ్రీరమ్య, కార్యదర్శి వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఆదివారం ఇబ్రహీంపట్నంలోని వీకే కన్వెన్షన్హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పదేండ్లుగా ఇబ్రహీంపట్నం ప్రాంతంలో నవ్యఫౌండేషన్ స్థాపించి అనేక సేవా కార్యక్రమాలను చేపడుతుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశ్, సత్తు వెంకటరమణారెడ్డి, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.