యాచారం, డిసెంబర్ 29 : మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని సాయి శరణం ఫంక్షన్ హాల్లో డ్వాక్రా సంఘాల మహిళలకు బ్యాంకు లింకేజీ రుణాలకు సంబంధించిన చెక్కులను ఆయన గురువారం పంపిణీ చేశారు. అంతకు ముందు డ్వాక్రా సంఘాల ద్వారా రుణాలు పొంది ఆర్థికంగా ఎదగడంతో పాటు, స్వయం ఉపాధి పొందిన మహిళలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సకాలంలో రుణాలు అందించి తమ కుటుంబాలకు అండగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు మహిళలు కృతజ్ఞతలను తెలిపారు. డ్వాక్రా సెల్ప్ హెల్ప్ గ్రూప్ తయారు చేసిన హ్యాండ్ మేడ్ ఆబ్జెక్ట్ స్టాల్ను ఆయన ప్రారంభించారు. అనంతరం మండలంలోని 24 గ్రామపంచాయతీలకు సంబంధించి 552 డ్వాక్రా సంఘాల మహిళలకు బ్యాంకు లింకేజీ రుణాల కింద రూ.38.24కోట్లు, 261 సంఘాలకు స్త్రీనిధి ద్వారా రూ.4.63 కోట్లు చెక్కుల రూపంలో లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మాట్లాడుతూ.. తక్కువ వడ్డీకి రుణాలను అందజేసి వారికి ఆర్థికంగా అండగా నిలుస్తున్నదన్నారు.
ప్రభుత్వం అందజేస్తున్న రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గతంలో ఇచ్చిన రుణాలకు రెండింతలు అందజేస్తూ మహిళా అభ్యున్నతికి సర్కారు కృషి చేస్తున్నదన్నారు. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలని ఆయన సూచించారు. మండలంలో పెండింగ్లో ఉన్న బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, ఉన్నతి రుణాలను సకాలంలో అందించి డ్వాక్రా సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు అన్ని విధాలుగా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కొప్పు సుకన్య, జడ్పీటీసీ చిన్నోళ్ల జంగ మ్మ, డీఆర్డీఏ పీడీ ప్రభాకర్, ఐకేపీ డీపీఎం జంగారెడ్డి, ఎంపీడీఓ విజయలక్ష్మి, పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్రెడ్డి, వైస్ చైర్మన్ యాదయ్య, సర్పంచ్లు శ్రీధర్రెడ్డి, కృష్ణ, సంతోష, విజయలక్ష్మి, ఎంపీటీసీలు బాబు, శారద, ఇస్త్రత్బేగం, సుమతమ్మ, పీఏసీఎస్ డైరెక్టర్లు శశికల, స్వరూప, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు పద్మ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్గౌడ్ పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత
ఇబ్రహీంపట్నంరూరల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఎంతోమంది పేదలకు అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని 12 మంది లబ్ధిదారులకు రూ.4.47లక్షల చెక్కులను ఇబ్రహీంపట్నం క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఇబ్రహీంపట్నం మండలం చర్లపటేల్గూడకు చెందిన నాగేశ్కు రూ.60 వేలు, రాయపోల్ గ్రామానికి చెందిన నేహాకు రూ.50 వేలు, పీ శ్రీనివాస్గౌడ్కు రూ.32 వేలు, అచ్చన బాలరాజుకు రూ.28 వేలు, జ్యోతికి రూ.18 వేలు, తుర్కయాంజాల్ మున్సిపాలిటీలోని కొహెడకు చెందిన పద్మావతికి రూ.60 వేలు, బుడ్డ కిషన్కు రూ.60 వేలు, బుడ్డ కృష్ణకు రూ.16 వేలు, మైలారం నర్సింహకు రూ.16వేలు, మంచాల మండలంలోని నోముల గ్రామానికి చెందిన బండారి కల్యాణికి రూ.60 వేలు, గంట యాదమ్మకు రూ.24 వేలు, చిత్రం సునీతకు రూ.23 వేల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.