రవీంద్రభారతి, డిసెంబర్ 17: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యం, శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో శుక్రవారం రవీంద్రభారతిలో జాతీయ సాహిత్య సదస్సు, శతాధిక కవిసమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పి.శ్రీలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగువారిగా కలిసి ఉందాం.. మన భాషా, యాసా, సంస్కృతిక, సంప్రదాయాలు ఒక్కటేనని పేర్కొన్నారు. గొప్ప గొప్ప కవులు, కళాకారులు పుట్టిన తెలుగు నేలమనిదని అన్నారు. శ్రీశ్రీ, గురజాడ, విశ్వనాథ సత్యనారాయణ, డాక్టర్ నారాయణరెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి, దాశరథి కృష్ణమా చార్యుల వంటి అనేక మంది కవులు గొప్ప గొప్ప కవిత్వాలు రాశారని వారు గుర్తు చేశారు. వారి త్యాగాలను ఎప్పటికీ వరువరాదన్నారు. అనంతరం 100 మంది కవులు, కళాకారులను మెమొంటోలతో ఘనంగా సత్కరించారు. అనంతరం చద్ది కూడు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన కవులు, కళాకారులు పాల్గొన్నారు.