తిరుమల : శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు టీటీడీ శుభవార్త తెలిపింది. ఈ మేరకు గురువారం శ్రీవారి వర్చువల్ సేవా దర్శన టికెట్లను విడుదల చేసింది. జనవరి నెలకు సంబంధించి 1,2 తేదీలు, జనవరి 13 నుంచి 22 వరకు, 23 నుంచి 26 వ తేదీల్లో 5,500మంది భక్తులకు అవకాశం కల్పిస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
శుక్రవారం ఉదయం 9 గంటలకు రూ. 3వందల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను జనవరి1, 13 నుంచి 22వ తేదీ వరకు రోజుకు 20వేల చొప్పున ఆన్లైన్లో టికెట్లను విడుదల చేయనున్నామని పేర్కొన్నారు. జనవరి 2 నుంచి 12, 23 నుంచి 31 వరకు రోజుకు 12వేల చొప్పున ఆన్లైన్లో టికెట్లను విడుదల చేస్తామన్నారు. తిరుమలలో వసతి గదుల సమాచారాన్ని ఈనెల 27న ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో ప్రకటిస్తామని వివరించారు. జనవరి 11 నుంచి 14 వరకు వసతిని తిరుమలలోనే నేరుగా బుకింగ్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు.