లాసానె: తొమ్మిదేండ్ల తర్వాత అమెరికన్ అథ్లెట్ ఎరిక్ కినార్డ్కు అదృష్టం కలిసొచ్చింది. 2012 లండన్ ఒలింపిక్స్ హైజంప్లో సాధించిన రజతం కాస్త ఇప్పుడు స్వర్ణంగా మారింది. స్వర్ణం సాధించిన ఇవాన్ ఉకోవ్ (రష్యా) డోపింగ్కు పాల్పడడంతో అతడి స్వర్ణం కినార్డ్కు చేరింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) పతకాలను మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కినార్డ్ స్వర్ణంగా అప్గ్రేడ్ కాగా, కాంస్యం సాధించిన ముగ్గురు డెరెక్ డ్రొయిన్ (కెనడా), రబీ గ్రాబర్జ్ (బ్రిటన్), ముతాజ్ ఎస్సా బర్షీమ్ (ఖతర్)కు రజతం ప్రకటించారు. మహిళల హైజంప్లో రుత్ బీషియాకు ఐవోసీ కాంస్యం కేటాయించింది.