ఆషాఢం వచ్చేసింది ! బోనం పండుగకు భాగ్యనగరం ముస్తాబైంది. ఈ నెల 11 ఆదివారం బోనాల పండుగ ప్రారంభం కాబోతోంది. సంప్రదాయం ప్రకారం గోల్కొండ కోట నుంచే తొలి బోనాలు మొదలు కాబోతున్నాయి. ఈ సందర్భంగా భక్తులు తమ మొక్కులు చెల్లించుకునేందుకు కోటపై ఉన్న గోల్కొండ ఎల్లమ్మ వారి ఆలయానికి శుక్రవారం పెద్ద ఎత్తున తరలివచ్చారు. మెట్టు మెట్టుకు బొట్లు పెడుతూ కొండపైకి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు.