న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ : దేవీ శరన్నవరాత్రోత్సవాలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా సోమవారం ప్రారంభమయ్యాయి. పలు ఆలయాల్లో తొలి రోజు అమ్మవారు బాలాత్రిపురసుందరిగా భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుంచే సుప్రభాతం, అభిషేకం, అలంకరణ, మహా మంగళహారతి, మంత్రపుష్పం వంటి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు కుంకుమార్చన చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
షాద్నగర్టౌన్, సెప్టెంబర్ 26: దేవీ నవరాత్రోత్సవాలు షాద్నగర్ పట్టణంలో సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని శివమారుతిగీతా అయ్యప్ప మందిరంలో దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా మొదటి రోజు బాలాత్రిపురసుందరిగా అమ్మవారు దర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుంచి అమ్మవారికి సుప్రభాతం, అభిషేకం, అలంకరణ, కుంకుమార్చన, మహా మంగళహారతి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పట్టణంలోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారు బాలాత్రిపురసుందరిదేవి అవతారంలో దర్శనమిచ్చారు. మున్సిపాలిటీలోని పెద్ద జానమ్మపేట లక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో అమ్మవారు మొదటి రోజు స్వర్ణకవచాలంకరణ దుర్గాదేవిగా దర్శనమిచ్చారు.
కడ్తాల్ : మండల పరిధిలోని మైసిగండి గ్రామంలోని రామాలయ, శివాలయాల్లో అన్నపూర్ణేశ్వరీదేవి శరన్నవరాత్రుల మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శరన్నవరాత్రుల ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మండల కేంద్రంలోని షిర్డీ సాయిబాబా ఆలయంలో దేవీశరన్నరాత్రుల ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అమ్మ వారు బాలాత్రిపుర సుందరిగా దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఆర్పీ జ్యోతి, ఆలయ ఈవో స్నేహలత, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శిరోలీపంతూనాయక్, నిర్వాహకులు రామావత్ భాస్కర్నాయక్, అరుణ్కుమార్, నాయకులు రాఘవేందర్, ఆలయ అర్చక సిబ్బంది పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం : నియోజకవర్గంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇబ్రహీంపట్నంలో ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వఅంబేద్కర్ చౌరస్తా నుంచి మండపం వరకు రోడ్డుకిరువైపులా విద్యుత్దీపాలను ఏర్పాటు చేశారు.