హైదరాబాద్,జులై 2:మార్చి త్రైమాసికంలో నికర లాభం దాదాపు 100 శాతం పెరిగి రూ .27.48 కోట్లకు చేరుకున్నట్లు హిందూజా గ్రూప్ సంస్థ జిఓసిఎల్ కార్పొరేషన్ లిమిటెడ్ తెలిపింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.13.81 కోట్లతో పోలిస్తే 99 శాతం పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది. ఆదాయంలో మార్పులేదని, గతేడాది స్థాయిలోనే రూ.150 కోట్లు నమోదైందని తెలిపింది. మొత్తం ఏడాదికి రూ.557 కోట్ల ఆదాయంపై రూ.78.7 కోట్ల లాభాన్ని ఆర్జించింది. వాటాదారులకు రూ.2 విలువ కలిగిన షేరుపై 100శాతం రూ.2 తుది డివిడెండ్ను ప్రకటించింది.