పనాజీ: బీజేపీ నేత సోనాలీ పోగట్ మృతి కేసును సీబీఐకి ఇవ్వాలని గోవా ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. సోనాలీ అనుమానాస్పద మృతి కేసును సీబీఐకి అప్పగించాలని ఆమె కుటుంబ సభ్యులు హర్యానా సీఎం కట్టర్ను కూడా కోరారు. గోవా ప్రభుత్వ విచారణ పట్ల సంతృప్తికరంగా లేనట్లు సోనాలీ ఫ్యామిలీ పేర్కొన్నది. గోవా పోలీసుల్ని సంపూర్ణంగా నమ్ముతున్నామని, కానీ సోనాలీ కూతురు డిమాండ్ ప్రకారం, ఆ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతున్నట్లు గోవా సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు. సీబీఐకి అప్పగించాలని చాలా మంది లేఖలు కూడా రాశారని, అందుకే ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని కేంద్ర హోంశాఖను కోరుతున్నట్లు సీఎం వెల్లడించారు.