హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): పేదవారి సొంతింటి కలను నిజం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల పథకానికి ప్రపంచస్థాయి గుర్తింపు దక్కింది. స్మార్ట్సిటీ ఎక్స్పో వరల్డ్ కాంగ్రెస్ (ఎస్సీఈడబ్ల్యూసీ) పదో వార్షికోత్సవం సందర్భంగా అందజేయనున్న అవార్డులలో చోటు దక్కింది. బార్సిలోనాలో 2011 నుంచి ఎస్సీఈడబ్ల్యూసీ వివిధ దేశాల్లో అమలవుతున్న సంచాలనాత్మక పథకాలు, అభివృద్ధి, సంక్షేమ, సేవా కార్యక్రమాలను గుర్తించి అందులో భాగస్వాములైన ప్రభుత్వాలు, వ్యక్తులను సంస్థ అవార్డులతో సత్కరిస్తుంది. ఇందులో భాగంగా 2022 సంవత్సవానికి మొత్తం 8 క్యాటగిరీల్లో ఇటీవలే అవార్డులను ప్రకటించింది. ఇందులో ‘లివింగ్ అండ్ ఇన్క్లూజన్’ విభాగంలో తెలంగాణ 2 బీహెచ్కే పథకాన్ని ఎంపిక చేసింది. ‘తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్లో 2 బీహెచ్కే హౌసింగ్ ఒకటి. దారిద్య్రరేఖకు దిగువన నివసించే నిరాశ్రయులైన పేదప్రజలకు ఉచితంగా గౌరవప్రదమైన గృహాలను అందించడం ఈ పథకం ఉద్దేశం. భారతదేశంలోని బలహీనవర్గాల గృహనిర్మాణ కార్యక్రమంలో ఇది గణనీయమైన మార్పునకు శ్రీకారం చుట్టింది’ అంటూ ఎస్సీఈడబ్ల్యూసీ వెబ్సైట్లో పేర్కొన్నది.