అమరావతి,జూన్ 30: యువకుడి వేధింపులకు అభం శుభం తెలియని బాలిక బలైపోయింది.తాడేపల్లికి చెందిన 16ఏండ్ల బాలిక పదో తరగతి చదువుతున్నది. కొద్దిరోజుల క్రితం ఆమె ఇంటికి సమీపంలోని దుకాణానికి వెళ్లిన సమయంలో మహేంద్ర అనే యువకుడు వేధింపులకు పాల్పడ్డాడు. అప్పటినుంచి ఆమె ఎక్కడికెళ్లినా వెంటపడుతూ ప్రేమించాలంటూ బెదిరింపులకు దిగేవాడు.
ఈ విషయాన్ని ఇంట్లో చెప్పడానికి భయపడిన బాలిక ఈ నెల 4వతేదీన పురుగుల మందు తాగింది. ఆతర్వాత వాంతులు కావడంతో కుటుంబ సభ్యులు విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా బాలిక చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందింది. తమ బిడ్డ ప్రాణాలు బలి తీసుకున్న మహేంద్రను కఠినంగా శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు కోరుతున్నారు. విజయవాడలోని పటమట పోలీస్స్టేషన్ నుంచి సమాచారం రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పోలీసులు మహేంద్ర ను అరెస్టు చేశారు.