ముంబై: మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, ఓ బాలిక మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ముంబైలో ఉన్న నందన్వన్ బంగ్లాలో ఈ ఘటన జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. వరదల్లో చిక్కుకున్న వారిని ఆదుకున్నట్లు నేను కూడా హెల్ప్ చేస్తే సీఎంను అవుతానా అని అన్నదా దామ్రే అనే బాలిక ఏక్నాథ్ను అడిగింది. అస్సాంలో వదరలు వచ్చినప్పుడు మీరు ఆ నీటిలో వెళ్లి ఆదుకున్నారా కదా అని ఆ అమ్మాయి ప్రశ్న వేసింది. దానికి సీఎం షిండే సమాధానం ఇస్తూ అవును కచ్చితంగా నువ్వు సీఎం కావొచ్చు అని, దీనికి సంబంధించిన తీర్మానం పాస్ చేస్తామని నవ్వుకుంటూ అన్నారు. ఆ తర్వాత మళ్లీ ఆ అమ్మాయి మాట్లాడుతూ.. దీపావళి పండుగ వేళ తనను గౌహతి తీసుకువెళ్లాలంటూ అడిగింది. తప్పుకుండా వెళ్దాం, గౌహతిలో కామాఖ్యా ఆలయానికి వెళ్లాలని ఉందా అని షిండే అన్నారు. అవును అని ఆ బాలిక సమాధానం ఇచ్చింది. అమ్మాయి చాలా స్మార్ట్గా ఉందని షిండే తనతో ఉన్నవారితో అన్నారు. ఉద్దవ్ ఠాక్రేకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఏక్నాథ్ కొన్ని రోజుల పాటు గౌహతిలో క్యాంపు పెట్టిన విషయం తెలిసిందే.
#WATCH | After meeting Maharashtra CM Eknath Shinde at his Nandanvan bungalow in Mumbai, a girl Annada Damre requested him to take her to Guwahati during Diwali vacation and also asked if she could become the CM by helping flood-affected people just like he did?
(Source: CMO) pic.twitter.com/WSdUN16jHq
— ANI (@ANI) July 18, 2022