సిటీబ్యూరో, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ ) :జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం జరిగింది. ఏడాది తర్వాత జరిగిన మొట్ట మొదటి స్టాండింగ్ కమిటీ సమావేశం కావడంతో సభ్యులు అధికారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన సభ్యులకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పుష్పగుచ్ఛం అందజేశారు. స్టాండింగ్ కమిటీ సమావేశంలో 20 అంశాలకుగాను 18 అంశాలకు ఆమోదం తెలిపారు. ఐటీ విభాగంతో సహా ఇతర విభాగాల్లోని పనులకు కాంట్రాక్ట్ ఏజెన్సీల నియామకాలను పొడిగించారు.
ఇకనుంచి ప్రతి వారం సమావేశాలు: మేయర్
ఎన్నికలు, కొవిడ్, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించడంలో జాప్యం జరిగిందని మేయర్ విజయలక్ష్మి అన్నారు. ఇక నుంచి స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్దేశించిన ప్రకారంగానే ప్రతి వారం జరుగుతాయన్నారు. అత్యంత ప్రాముఖ్యత గల స్టాండింగ్ కమిటీ సమావేశం పాలసీ నిర్ణయాల కమిటీ కాబట్టి నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకొని నగర అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. నగరాభివృద్ధికి అందరం కలిసి చర్చించి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.
భూసేకరణకు సహకరించాలి: కమిషనర్
సభ్యులు సూచించిన అంశాలను పరిగణలోకి తీసుకొని క్షేత్ర స్థాయిలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ అన్నారు. మిస్సింగ్, లింకు రోడ్ల నిర్మాణాలకు, నాలాల మరమ్మతు పనులు చేపట్టేందుకు కావాల్సిన భూసేకరణలో కార్పొరేటర్లు పూర్తి సహకారం అందించాలని పేర్కొన్నారు. కాగా సమావేశంలో సభ్యులు ఎకువగా శానిటేషన్పై చర్చించారు. కార్పొరేటర్లు, అడిషనల్ కమిషనర్తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిషరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
14మంది సభ్యులు హాజరు
మొట్టమొదటి స్టాండింగ్ కమిటీ సమావేశానికి 14మంది సభ్యులు హాజరయ్యారు. పన్నాల దేవేందర్ రెడ్డి, ముహమ్మద్ అబ్దుల్ సలాం షాహిద్, మహపరా, మిర్జా ముస్తఫా బేగ్, పర్వీన్ సుల్తానా, మందగిరి స్వామి, బాత జాబీన్, ఇ.విజయకుమార్ గౌడ్, మహ్మద్ రషీద్ ఫరాజుద్దిన్, సీఎన్.రెడ్డి, మందాడి శ్రీనివాసరావు, వై.ప్రేమ్కుమార్, సామల హేమ, కుర్మా హేమలత, కార్యదర్శి లక్ష్మి, ఇంజినీర్ ఇన్ చీఫ్ జియాఉద్దీన్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, ఎస్ఆర్డీపీ చీఫ్ ఇంజినీర్ దేవానంద్, సీసీపీ దేవేందర్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ శ్రీనివాస్, అడిషనల్ కమిషనర్లు బి.సంతోష్, ప్రియాంక అలా, జయరాజ్ కెన్నెడీ, విజయలక్ష్మి, సరోజ, జోనల్ కమిషనర్లు పంకజ, మమత, రవి కుమార్, శ్రీనివాస్ రెడ్డి, ఎంటమాలజీ చీఫ్ రాంబాబు, పలు శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఆమోదించిన 18 అంశాల్లో ప్రధానమైనవి..!