యాదాద్రి భువనగిరి : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ శనివారం ఉదయం యాదాద్రి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మీ నారసింహ స్వామిని మేయర్ విజయలక్ష్మీ కుటుంబ సమేతంగా దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం మేయర్ను ఆలయ అర్చకులు ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.