హుజురాబాద్ :హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు తమ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘం ప్రకటించింది. ఈ మేరకు హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలో జరిగిన గంగపుత్రుల సంఘీభావ ఆశీర్వాద సభలో గంగపుత్ర సంఘం ఏకగ్రీవ తీర్మానం చేసింది.
ఈ సమావేశంలో పాల్గొన్నసంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ , ఎమ్మెల్యేలు కొరుకంటి చందర్ , ముఠా గోపాల్, హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ సమక్షంలో టీఆర్ ఎస్కు ఓటు వేయాలని తీర్మానం చేయడంతోపాటు ఎన్నికల ఖర్చు నిమిత్తం రూ. 25116/-విరాళం అందజేశారు.
ఈ సభలో మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వర్ రావు , వైస్ చైర్మన్ దేశిని స్వప్న-కోటి, టీఆర్ ఎస్ నాయకులు తుమ్మెటి సమ్మిరెడ్డి, పోనగంటి మల్లయ్య, టంగుటూరి రాజుకుమార్, హైదరాబాద్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, తదితర గంగపుత్ర సంఘ నాయకులు పాల్గొన్నారు.