శేరిలింగంపల్లి : గచ్చిబౌలి సైబరాబాద్ కమిషనర్ కార్యాలయం సమీపంలోని సెంట్రల్ బ్యాంకు ఆప్ ఇండియా బ్యాంకులో స్ట్రాంగ్ రూం తెరిచేందుకు విపలయత్నం చేసి చివరకు కంప్యూటర్ సామాగ్రి ఎత్తుకెళ్లిన దుండగులను రాయదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సైబరాబాద్ పోలీసులు సంఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సీసీటీవీ పుటేజీ అదారంగా కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు చోరికి పాల్పడింది ఇద్దరు(భార్యభర్తలు) వ్యక్తులుగా గుర్తించారు.
సెంట్రల్ బ్యాంకు సీసీటీవీ కెమెరాల వైర్లు కత్తిరించి, సీసీటీవీలకు చెందిన డీవీఆర్ను తెలివిగా తమవెంట ఎత్తుకెళ్లినప్పటికీ సదరు బ్యాంకు ఉన్న వాణిజ్య సముదాయంలోని ఇతర సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలించడంతో నిందితుల అనవాళ్లు అందులో రికార్డు అయ్యాయి. వాటిని అదారంగా చేసుకొని చోరికి పాల్పడి కంప్యూటర్ సామాగ్రితో ట్రాలీ ఆటోలో గచ్చిబౌలి వెపు వెళ్లినట్లు పుటేజీ దృశ్యాలు పోలీసులకు లభించాయి. దీంతో చోరి జరిగిన బుదవారం తెల్లవారుజామున ఉదయం 5.08 నిముషాలకు ఆటోట్రాలీలో గచ్చిబౌలి వైపు పారిపోవడం గమనించి గచ్చిబౌలి వైపు ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు.
దీంతో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ సమీపంలోని ట్రిపుల్ఐటీ జంక్షన్ వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలో నిందితులు వెళ్తున్న ట్రాలీ ఆటో నెంబర్ గుర్తించి దాని ఆదారంగా చోరికి పాల్పడిన భార్యభర్తలను పోలీసులు గోపన్పల్లికి చెందిన వారిగా గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా అదుపులోకి తీసకున్న నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. ఇంతకుముందు ఎమైన చోరీలకు పాల్పడ్డారా, పాత నేరస్ధులా అనే విషయాలపై విచారించినట్టు తెలిసింది. కాగా సదరు భార్యభర్తలు అప్పుల ఉబిలో చిక్కుకుని మొదటిసారి ఈ చోరికి పాల్పడినట్లు విశ్వసనీయ సమాచారం. వీరిని త్వరలో పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టన్నుట్లు తెలుస్తోంది.