కాచిగూడ,డిసెంబర్ 27: నూతన జోనల్ విధానంలో ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు ఏ విధంగా కేటాయింపులు చేస్తున్నారో,అదే విధంగా బీసీ ఉద్యోగులకు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో సోమవారం కాచిగూడలోని ఓ హోటల్లో సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆర్.కృష్ణయ్య హాజరై మాట్లాడుతూ బీసీ ఉద్యోగులకు న్యాయం జరుగాలంటే జీవో నంబర్ 317ను సవరించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణలోని 33 జిల్లాల్లో ప్రతి జిల్లాకు 25 శాతం బీసీ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కేటాయింపు జరిగేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో గుజ్జ కృష్ణ, నీలా వెంకటేశ్, జిల్లపల్లి అంజి,చంటి ముదిరాజ్, పగిల సతీశ్, వెంకట్, భాస్కర్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.