హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయ్సేన్రెడ్డి
డిచ్పల్లి, అక్టోబర్ 30: న్యాయ సేవాధికార సంస్థ ద్వారా పేదలకు ఉచిత న్యాయ సేవలు అందిస్తున్నామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయ్సేన్రెడ్డి తెలిపారు. అయితే ఈ సేవలపై అవగాహన లేక చాలామంది వినియోగించుకోవడం లేదన్నారు. దీనిపై మరింత విస్తృత ప్రచారం చేయాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. శనివారం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాలులో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పాన్ ఇండియా అవగాహన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన న్యాయసేవల మాడ్యుల్ క్యాంప్లో ఆయన ప్రసంగించారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. జిల్లా జడ్జి, కలెక్టర్లతో కలిసి లబ్ధిదారులకు చెక్కులు, సైకిళ్లు, దుప్పట్లు, మందులను అందజేశారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా జడ్జి గోవర్ధన్రెడ్డి, కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, నిజామాబాద్ అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.