చర్లపల్లి, అక్టోబర్ 30: ఖైదీల ఆరోగ్య పరిరక్షణకు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చర్లపల్లి వ్యవసాయ క్షేత్రం(ఒపెన్ ఎయిర్) జైలు సూపరింటెండెంట్ శివప్రసాద్ పేర్కొన్నారు. శనివారం చర్లపల్లి ఒపెన్ ఎయిర్ జైలులో ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖైదీల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ఖైదీలకు మెరుగైన వైద్య సేవల్లో భాగంగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అనంతరం పలువురు వైద్యులు ఖైదీల దంత సమస్యలకు చికిత్సలు చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ చింతల దశరథం, వైద్యులు కౌశిక్, మృణాళిని, పూజ, షఫాలి, రీతు, అమిత్, విష్ణు, వివేక్, లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ గవర్నర్ గోపాల్రావు, సురేశ్, జైలర్ సాయి సురేశ్ బాబు, డిప్యూటీ జైలర్ మహిపాల్రెడ్డి, జైలు సిబ్బంది పాల్గొన్నారు.