తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ కల్పవృక్ష వాహనసేవలో నాలుగు ఆధ్యాత్మిక పుస్తకాలను టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఈవో ఎవి.ధర్మారెడ్డి ఆవిష్కరించారు. వీటిలో వైఖానసాగమ శాస్త్రా ల్లో అత్యంత ప్రామాణికమైన ‘వాసాధికారః ’, ‘యజ్ఞాధికారః’, ‘ఖిలాధికారః’ అనే గ్రంథాలను వైఖానస ఆగమశా స్త్ర సంరక్షణలో భాగంగా ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఆచార్యులు వీటిని పరిష్కరించి ముద్రించారు.
మరో గ్రంథం సప్తగిరి మాసపత్రిక విశ్రాంత సంపాదకులు జూలకంటి బాలసుబ్రహ్మణ్యం రచించిన తిరుమల క్షేత్రగాథ కూడా ఉంది. శ్రీవారి దర్శన విధానం, చూడవలసిన అద్భుత ప్రదేశాలు, దర్శించవలసిన పుణ్యతీర్థాలు, ప్రత్యేక స్థలాల గురించిన వివరాలు ఉన్నాయని వ్యాసకర్తలు తెలిపారు.