న్యూఢిల్లీ: హిమాలయ యోగిగా మాయచేసింది ఆనంద్ సుబ్రమణియనేనని కోర్టుకు సీబీఐ తెలిపింది. కో-లొకేషన్ కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ సుబ్రమణియన్ దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. హిమాలయ యోగి.. ఆనంద్ సుబ్రమణియన్ ఒక్కరేనని చెప్పారు. ఎన్ఎస్ఈ మాజీ ఎండీ చిత్రా రామకృష్ణన్ నిర్ణయాలను ఆయన ప్రభావం చేశారని తెలిపారు. చిత్రా రామకృష్ణన్కు ఆయన సలహాదారుగా వ్యవహరించారు. వాదనలను విన్న కోర్టు బెయిల్ మంజూరుపై తీర్పును వాయిదా వేసింది.