మహబూబ్నగర్ : బొగ్గు స్కాంపై సమాధానం చెప్పలేకనే సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్కు సిట్ నోటీసులు పంపారని మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసులపై ఆయన స్పందించారు. కేసీఆర్కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా మన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్పై కాంగ్రెస్ పార్టీ రాజకీయ కక్ష్య సాధింపు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాలనా వైఫల్యం, కాంగ్రెస్ వరుస స్కాంల నుంచి దృష్టి మళ్లించేందుకే సిట్ నోటీసులు ఇచ్చిందని ఆరోపించారు. ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ నాయకులు సింహాల్లా గర్జిస్తూనే ఉంటారు. కేసీఆర్ వెంట తెలంగాణ సమాజం అంతా ఉంది. మీ కేసులకు, నోటీసులకు భయపడేది లేదు. అక్రమ కేసులపై ప్రజా క్షేత్రంలోనే బీఆర్ఎస్ తేల్చుకుంటుందని స్పష్టం చేశారు.