న్యూఢిల్లీ: ఆసియా ఫుట్బాల్ కప్ సన్నాహాకాల్లో భాగంగా భారత్, జాంబియా మధ్య జరుగాల్సిన స్నేహాపూర్వక మ్యాచ్ రైద్దెంది. ఈనెల 25న మ్యాచ్ జరుగుతుందని శుక్రవారం అపెక్స్ కమిటీ ప్రకటించగా.. అనంతరం కొన్ని గంటల వ్యవధిలోనే జాంబియా తాము ఈ మ్యాచ్ ఆడలేమని ప్రకటన చేసింది. ప్లేయర్లు అందుబాటులో లేకపోవడంతో మ్యాచ్ ఆడలేమని పేర్కొంది. ఇరు జట్ల మధ్య క్వాలిఫయర్స్ ఫైనల్ రౌండ్ మ్యాచ్లు జూన్ 8 నుంచి మొదలుకానున్నాయి.
వాటికి సన్నాహాకంగా ఈ స్నేహాపూర్వక పోరు జరుగాల్సి ఉంది. ‘మా ప్రొఫెషనల్ ఆటగాళ్లు అందుబాటులో ఉండేందుకు తీవ్రంగా ప్రయత్నించాం. కానీ మా ప్రయత్నాలు విఫలమయ్యాయి. మే 25న భారత్తో జరుగాల్సిన మ్యాచ్ ఆడలేమని తెలిపేందుకు చింతిస్తున్నాం’ అని జాంబియా ఫుట్బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి అడ్రియాన్ కశాల తెలిపాడు. ఈ మేరకు అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్యకు (ఏఐఎఫ్ఎఫ్) శుక్రవారం లేఖరాశారు.