ఆసిఫాబాద్ : జిల్లాలోని పెంచికల్ పేట్ మండలం ఎల్లూరు ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం (Food Posion) తిని ఆరుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం చేశాక అర్ధరాత్రి మరోసారి భోజనం చేసిన విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగిందని అధికారులు వివరించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను కాగజ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు. ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.