– నల్లగొండ సీడీపీఓ తూముల నిర్మల
నీలగిరి, ఏప్రిల్ 13: మాతాశిశు ఆరోగ్యాన్ని మెరుగు పరచడంపై దృష్టి సారించాలని ఐసీడీఎస్ నల్లగొండ సీడీపీఓ తూముల నిర్మల ఆన్నారు. సోమవారం నల్లగొండ పట్టణంలోని రహమత్బాగ్-2 అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ పక్యాడా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లి, బిడ్డ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా సురక్షిత మాతృత్వంపై దృష్టి సారించాలన్నారు. పోషక విలువలలో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. పోషణ పక్వాడ కార్యక్రమాన్ని ఈ నెల 8వ తేది నుండి 23వ తేది వరకు నిర్వహించినున్నట్లు తెలిపారు.
పౌష్టికాహార పదార్థాలను పదర్శన చేసి చిరుదాన్యాలతో ఆరోగ్యకరమైన వంటకాల ప్రదర్శన నిర్వహించారు. తల్లులు, సంరక్షకుల మద్య చిన్నపాటి వంటల పోటీసలు నిర్వహించి ఉత్తమ వంటకాలను గుర్తించి బహుమతులు అందజేశారు. ఫ్రీస్కూల్ పిల్లలకు గ్రాడ్యూమేషన్ డే నిర్వహించి పిల్లల అభివృద్ధి కార్డులను తల్లిదండ్రులకు అందజేశారు. అనంతరం కాలనీలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ వినోద, ఆంగన్వాడీ టీచర్లు రజియా సుల్తానా, అనంతలక్ష్మీ, షహనాజ్ బేగం, జేరినా బేగం, ఆయా అక్తర్, షహబాజ్, సునీత పాల్గొన్నారు.