ఊట్కూర్, నవంబర్23: ప్రభుత్వ ఆదేశాల ప్రకారం యాసంగి వరి సాగు చేయకుండా రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని మండల వ్యవసాయ శాఖ అధికారి గణేశ్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని చిన్నపొర్ల రైతు వేదిక భవనంలో రైతులకు అవగాహన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆయిల్పామ్ పంట సాగుతో అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. వ్యవసాయ శాఖ, ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో రైతులకు అందుబాటులో ఉండే రాయితీలు, డ్రిప్, స్ప్రింక్లర్లు, ఆయిల్ పామ్, పండ్లు, కూరగాయల తోటల పెంపకం పట్ల అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయిల్ పామ్ సాగుకు పలువురు రైతులు ముందుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ రవీందర్రెడ్డి, హార్టికల్చర్ అధికారి సమీనాబేగం, సెరీకల్చర్ అధికారి మహిపాల్, రైతు బంధు సమితి గ్రామాధ్యక్షుడు అనీల్కుమార్రెడ్డి, ఏఈవో కల్పన పాల్గొన్నారు.
కానుకుర్తిలో వేరుశనగ పంట పరిశీలన
మండలంలోని కానుకుర్తి గ్రామంలో రైతు అనంత్రెడ్డి వేరుశనగ పంటను వ్యవసాయ విస్తరణ అధికారి నరేశ్ పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ లద్దె పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నందున మందులు వాటి మోతాదుపై వివరించారు.