అడ్డగుట్ట : గుట్టుచప్పుడు కాకుండా గంజాయి క్రయ విక్రయాలు జరుపుతున్న ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గురువారం నార్త్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ చందనా దీప్తి మాట్లాడు తూ.. ఒడిస్సాకు చెందిన రాజు రహత్ (35), గిరిదరీ కైబార్త (36), బుంగార్జ్ శబార్ (26) బతుకుదెరువు కోసం హైదారాబాద్కు వలసవచ్చారు.
వీరికి పరిచయస్తుడైన పంకజ్ సరాజ్ అనే వ్యక్తి నుంచి డ్రైగంజాయి సరుకును కిలోకు రెండు వందల చొప్పున కొనుగోలు చేస్తారు. వీరికి అనుచరులుగా ఉన్న లాల్బజారుకు చెందిన కరోల్ మహేష్ కుమార్ (23), బోయిన్పల్లికి చెందిన మహ్మద్ ఆన్వర్(21)లకు కిలోకు మూడు వందల చొప్పున విక్రయిస్తారు.
మహేష్ కుమార్, మహ్మద్ అన్వర్లు కూలీలు పని కోసం వేచి ఉండే అడ్డా వద్ద నిరుపేదలను ఆసరా చేసుకొని గంజాయి క్రయవిక్ర యాలను సాగిస్తుంటారు. విశ్వసనీయ సమాచారం మేరకు తిరుమలగిరి సిఐ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పా టు చేసి తిరుమలగిరిలో అన్వర్ను గంజాయి విక్రయిస్తుండగా పోలీసులు రెడ్హ్యాండేడ్గా పట్టుకున్నారు.
ఆన్వర్ ద్వారా మిగిలినవారిని అదుపులోకి తీసుకున్నారు. పంకజ్ పరారీలో ఉన్నాడని నార్త్ జోన్ డీసీపీ చందనా దీప్తి ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ నరేష్, సిఐ శ్రావణ్కుమార్లు పాల్గొన్నారు.