అమరావతి : ఏపీలో గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులకు వృత్తి నైపుణ్యతా శిక్షణ పేరిట కోట్ల రూపాయల నిధులను దారి మళ్లించారని వచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం ఏపీ సీఐడీ అధికారులు మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణతో పాటు 26 మందిపై ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. అప్పటి ఓఎస్డీ నిమ్మగడ్డ వెంకటకృష్ణ, పుణెకు చెందిన డిజైన్ టెక్ సిస్టం, పాత్రిక్ సర్వీస్, ఐటీ స్మిత్ సొల్యూషన్స్, ఇన్వెబ్ సర్వీస్లపై కూడా నోటీసులు జారీ చేశారు.
ఫోరెన్సిక్ ఆడిట్ ఆధారంగా స్కిల్ డెవలప్మెంట్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించిన అధికారులు పలువురిపై కేసు నమోదు చేశారు. కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు్ ఎఫ్ఐఆర్లో సీఐడీ అధికారులు వెల్లడించారు. మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ సోమవారం తమ ఎదుట హాజరుకావాలని నోటీసులు చేశారు.