జగిత్యాల జిల్లా కోరుట్లలోని రథాలపంపు కాలనీలో చెట్టు నరికిన వ్యక్తికి అధికారులు రూ.5 వేల జరిమానా విధించారు. మంచికట్ల విజయ్ అనే వ్యక్తి శనివారం ఓ చెట్టును నరికేశాడు. అధికారులు విచారణ జరిపి జరిమానా విధించారు. అకారణంగా మొక్కలను తొలగిస్తే ఇక నుంచి రూ. 25 వేల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. -కోరుట్ల