మార్కూక్ : గుండెపోటుతో మృతి చెందిన తమ చిన్ననాటి స్నేహితుని కుటుంబానికి అండగా బాల్యమిత్రులు. మార్కూర్ మండలం నర్సన్నపేట గ్రామానికి చెందిన మాచిరెడ్డి రాంచంద్రారెడ్డి పది రోజుల కిందట గుండెపోటుతో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న తన పదో తరగతి (1989-1990) బ్యాచ్ విద్యార్థులు రాంచంద్రారెడ్డి కుటుంబాన్ని పరామర్శించి, రూ.35వేల ఆర్థిక సాయాన్ని మృతుడి భార్య పద్మకు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా అతని స్నేహితులు మాట్లాడుతూ చిన్న వయసులో మిత్రుడిని కోల్పోచాలా బాధాకరమన్నారు. తీగుల్ జడ్పీహెచ్లో 10వ తరగతి వరకు చదివిన అందరితో కలుపుగోలుగా ఉండేవాడని గుర్తు చేసుకున్నారు. స్నేహితుని కుటుంబానికి అన్నివిధలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నర్సింలు,హెచ్ ఎల్లయ్య, నర్సింలు, కనకరెడ్డి, నర్సింహరెడ్డి, చారి, పెద్ది శ్రీనివాస్, లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.