హిమాయత్నగర్, జనవరి 16: ఆర్థిక సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరించేందుకు కుట్ర పన్నుతున్నదని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్ విమర్శించారు. మోదీ సర్కారు అనుసరిస్తున్న నిరంకుశ విధానాలపై ఐక్య పోరాటాలు చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 5 నుంచి 7 వరకు హైదరాబాద్లో జరిగే ఏఐటీయూసీ జాతీయ సమితి సమావేశాలకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలను ఆదివారం ఆయన హిమాయత్నగర్లోని ఎస్ఎన్ రెడ్డి భవన్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా బోస్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 23, 24న నిర్వహించే సార్వత్రిక సమ్మెకు కార్మికులంతా సిద్ధం కావాలన్నారు.