కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన తండ్రీకూతుళ్లు అరుదైన ఘనత సాధించారు. తిరునగరి శ్రీకాంత్, ఆయన కూతురు హిమలేఖ్య ఇటీవల ఆఫ్రికాలోని ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు. ఈ విషయం తెలిసిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ.. శుభాకాంక్షలు తెలుపుతూ అభినందన లేఖ పంపించారు. ధైర్యంతో, దృఢ సంకల్పంతో ఈ అరుదైన ఘనత సాధించిన తండ్రి, కూతుళ్లు తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని కొనియాడారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
సంధ్యా సమయాన సాగర సౌందర్యం
నాడు కంపు.. నేడు ఇంపు : మూసీ అందం చూశారా