Station Ghanpur | జనగామ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయాలంటూ రైతులు నీటిని విడుదల చేసే గేట్ల వద్ద ధర్నా చేపట్టారు. మా పంటలు, బోర్లు, బావులు అన్నీ ఎండిపోయాయి. చుక్క నీళ్లు లేవు. పంటలకు, పశువులకు ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం నీటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వర్షాకాలం మొదలై రెండు నెలలు కావస్తున్నా ఇప్పటివరకు పంట పొలాలకు కాలువల ద్వారా నీటిని అందించడం లేదని ఆరోపించారు. తక్షణమే అధికారులు కాలువలకు నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
స్టేషన్ ఘనపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయాలంటూ రైతుల ధర్నా
నీటిని విడుదల చేసే గేట్ల వద్ద రైతుల ధర్నా
మా పంటలు, బోర్లు, బావులు అన్నీ ఎండిపోయాయి.. చుక్క నీళ్లు లేవు. చెట్లకు, పశువులకు ఇబ్బందిగా ఉంది
ప్రభుత్వం నీటిని వెంటనే విడుదల చేయాలి
వర్షాకాలం మొదలై రెండు నెలలు… pic.twitter.com/QpbzPt73Vl
— Telugu Scribe (@TeluguScribe) August 6, 2026