మేడ్చల్, జనవరి 8(నమస్తే తెలంగాణ)/ మేడ్చల్ రూరల్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్లే రాష్ట్రమంతా సస్యశ్యామలంగా మారిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లాలోని 61 గ్రామ పంచాయతీలలో రైతుబంధు వారోత్సవాలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. శనివారం జరిగిన వారోత్సవాలలో మంత్రి మల్లారెడ్డి రాంపల్లి దాయరా, కరీంగూడ, ఉద్ధమర్రి, శామీర్పేట, పొన్నాల ఎల్లంపేట గ్రామాలలో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది రూపాయలు వెచ్చించి ప్రాజెక్టుల నిర్మాణం చేయడంతో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తుందన్నారు. 8 విడతలలో రూ.50 వేల కోట్ల రైతుల ఖాతాలలో జమ చేయడం గొప్ప విజయం అన్నారు. ఒక్క మేడ్చల్ మండలంలోనే రూ.20 కోట్లు రైతుల ఖాతాల్లోకి చేరాయని తెలిపారు. టీఆర్ఎస్ హయాంలో పల్లెల రూపురేఖలు మారాయన్నారు. పచ్చదనం, పరిశుభ్రతతో పల్లెలు కళకళలాడుతున్నాయని చెప్పారు. 24 గంటల పాటు కరెంట్, రైతు బీమా ఇస్తున్న రాష్ట్రం దేశంలో ఎక్కడ లేదన్నారు.
రాష్ట్ర అభివృద్ధి చూసి బీజేపీ నాయకులు ఓర్వలేక పోతున్నారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. బీజేపీ నాయకులు చేప్పే మాటలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. రైతులందరూ సంతోషంగా ఉన్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదలు తెలుపుతూ రైతుబంధు వారోత్సవాలలో స్వచ్ఛందగా పాల్గొంటున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందన్నారు.
వారోత్సవాలలో ప్రజా ప్రతినిధులు, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు నందారెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి చామకూర మహేందర్ రెడ్డి, హెల్త్ సిటీ చైర్మన్ భద్రారెడ్డి, డాక్టర్ ప్రీతిరెడ్డి, జడ్పీటీసీ అనిత, శైలజ, ఎంపీపీలు హారిక మురళీ గౌడ్, పద్మా జగన్ రెడ్డి, జడ్పీటీసీ శైలజా విజయేందర్ రెడ్డి, మల్లారెడ్డి ఎడ్యూకేషన్ సొసైటీ డైరెక్టర్ శాలినీరెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నందారెడ్డి, సర్పంచ్ వెన్నెల, ఎంపీటీసీ సభ్యుడు కుమార్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, ప్రధాన కార్యదర్శి సుదర్శన్, మహిళా అధ్యక్షురాలు రమా సురేశ్రెడ్డి, మాజీ సర్పంచ్లు మద్దుల శ్రీనివాస్ రెడ్డి, జగన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ శైలజా హరినాథ్, వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
విజయవంతంగా వారోత్సవాలు
మేడ్చల్ జిల్లాలో విజయవంతంగా రైతుబంధు వారోత్సవాలు జరుగుతున్నాయి. పలు గ్రామాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు ముగ్గుల వేస్తూ, ఊరూరా బండ్ల ఉరేగింపులను నిర్వహిస్తుండటంతో జిల్లాలోని 61 గ్రామ పంచాయతీలలో పండుగ వాతావరణం ఏర్పడింది. ముగ్గుల పోటీలలో ప్రతిభ కనబర్చిన మహిళలకు మంత్రి మల్లారెడ్డి నగదు, బహుమతులు ప్రదానం చేశారు. ఇంకా, మండల పరిధిలోని రాజ బొల్లారం తండాలో సర్పంచ్ మంగ్యా నాయక్ ఆధ్వర్యంలో రైతుబంధు సంబురాల్లో భాగంగా ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఎంపీటీసీ అంకిత, వార్డు సభ్యులు పాల్గొన్నారు.