Free Power | హైదరాబాద్ : రైతులకు 24 గంటల ఉచిత కరెంటు అనవసరమన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు ‘రైతు సమావేశాలు’ నిర్వహించారు. రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొని కాంగ్రెస్ తీరును ఎండగట్టారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలపై సమావేశాల్లో అవగాహన కల్పించారు. పలు చోట్ల రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. రైతుల జోలికొస్తే కాంగ్రెస్ అడ్రస్ను గల్లంతు చేస్తామని హెచ్చరించారు.
కాగా, ‘మూడు పంటలు టీఆర్ఎస్ నినాదం-మూడు గంటల కరెంటు కాంగ్రెస్ విధానం’ పేరుతో పది రోజులపాటు ఈ సమావేశాలు నిర్వహిస్తారు. కాంగ్రెస్కు మద్దతు ఇస్తే ఉచిత విద్యుత్తు రద్దు అవుతుందన్న విషయాన్ని ప్రజలకు తెలియజేస్తున్నారు. ప్రతి రైతు వేదిక వద్ద కనీసం వెయ్యిమంది రైతులకు తగ్గకుండా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.