నమస్తే తెలంగాణ నెట్వర్క్, జనవరి 9: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చొరవతో తెలంగాణలో ఎవుసం పండుగలా మారింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద ఎకరానికి రూ.10 వేలు అందజేస్తుండటంతో అన్నదాతల పెట్టుబడి రందితీరింది. పెట్టుబడి సాయం రూ.50 వేల కోట్లకు చేరువవ్వటంతో ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయి. రైతులతో కలిసి మంత్రు లు, ఇతర ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలు, పంటల ఉత్పత్తులతో అభిషేకాలు చేసి కృతజ్ఞతలు తెలిపారు.
ఎడ్లబండ్ల ర్యాలీలు, ముగ్గుల పోటీలు
రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా పలు జిల్లాల్లో వేడుకలు అంబరాన్నంటాయి. ఎడ్లబండ్ల ర్యాలీలు, ముగ్గు ల పోటీలతో సంక్రాంతి పండుగను మరిపించాయి. నిర్మల్ జిల్లా సోన్, దిలావర్పూర్లో నిర్వహించిన ఎడ్లబండ్ల ర్యాలీలో దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పాల్గొన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతుబంధు పథకం ఎందుకు అమలు చేయట్లేదని రాష్ట్ర బీజేపీ నాయకులను ఆయన ప్రశ్నించారు. త్వరలో జరుగనున్న ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో కమలం పార్టీకి భంగపాటు తప్పదని జోస్యంచెప్పారు.
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వేపకుంట్ల, చిమ్మపూడి, వీ వెంకటాయపాలెంలో చేపట్టిన ఉత్సవాల్లో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పాల్గొన్నారు. గ్రామస్థులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని గౌడవెల్లిలో రైతుబంధు సంబురాల్లో కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ రైతు వ్యతిరేక విధానాలపై అన్నదాతలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లా తాండూరులో నిర్వహించిన ఎండ్లబండ్లు, ట్రాక్టర్ల ర్యాలీలో ఎమ్మెల్యే రోహిత్రెడ్డితో కలిసి విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన సంబురాల్లో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్, జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతితో కలిసి మంత్రి సత్యవతిరాథోడ్ పాల్గొన్నారు.
ఊరూరా ఉత్సాహంగా
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం పోతిరెడ్డిపల్లిలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత రైతుబంధు సంబురాల్లో పాల్గొన్నారు. బీబీనగర్ మండలం వెంకిర్యాలలో ట్రాక్టర్ ర్యాలీలో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, నూతనకల్లో ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్, నల్లగొండ జిల్లా కట్టంగూర్, చిట్యాలలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సంబురాల్లో పాల్గొని సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. కేతేపల్లిలోని మూసీ కుడి కాల్వ వద్ద కేసీఆర్ ఫ్లెక్సీపై క్రేన్ పైనుంచి పుష్పాభిషేకం చేశారు.
తిప్పర్తి రైతువేదిక వద్ద ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, పెద్దవూర మండలం పర్వేదులలో ఎమ్మెల్యే నోముల భగత్, నిర్మల్ జిల్లా బాసరలో ఎమ్మెల్యే విఠల్రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా జైనథ్లో ఎమ్మెల్యే జోగు రామన్న, మంచిర్యాల జిల్లా చౌటపల్లిలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సంబురాల్లో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా లాలాపురంలో ఎమ్మెల్యే రాములునాయక్తో కలిసి ఎంపీ నామా నాగేశ్వరరావు ఉత్సవాల్లో పాల్గొన్నారు. సత్తుపల్లి మండలంలో చేపట్టిన ర్యాలీలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఎడ్ల బండి తోలారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట, బల్మూరులో ఎడ్లబండ్ల ర్యాలీలో విప్ గువ్వల బాలరాజు, నారాయణపేట జిల్లా వర్కూర్ ట్రాక్టర్ల ర్యాలీలో ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి పాల్గొన్నారు.
అన్నదాతకు దన్నుగా రైతుబంధు
యువరైతుకు ఎమ్మెల్సీ కవిత ప్రశంసలు
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం పిప్రి గ్రామానికి చెందిన యువ రైతు రాజేశ్వర్ రైతుబంధు సాయంతో పంటలు పండిస్తూ లాభాలు పొందుతుండటంపై నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ ద్వారా అభినందించారు. తనకున్న నాలుగెకరాల్లో మక్క, పసుపు, వరి పండిస్తూ ఆనందంగా జీవిస్తున్నాడని.. ఇందుకు రైతుబంధే కారణమని పేర్కొన్నారు. రైతు రాజేశ్వర్ స్పందిస్తూ.. రైతుబంధు సాయం ద్వారా తన ఆర్థిక భారాన్ని సీఎం కేసీఆర్ తొలగించినట్టు చెప్పారు. బీటెక్ చదివి వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యానని, తనకు రూ.21,625 పెట్టుబడి సాయంగా వస్తున్నదని చెప్పారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
పెట్టుబడి బాధ తప్పింది
24 గంటల ఉచిత కరెంటు, పెట్టుబడి పైసలిత్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ సారే. మాకున్న ఎకరంన్నర భూమికి రూ.7,500 ఖాతాల జమయినయ్. వాటితో ఇత్తనాలు, ఎరువులు తెచ్చుకొన్నం. మరో ఎకరం కౌలుకు తీసుకొని కూరగాయలు పండిస్తున్న. వరి ఏస్తే పైసలు కనిపిస్తలేవ్. అందుకే కూరగాయలు పెడుతున్న. ఎకరంలో కాకర, బెండ, వంకాయ, అలసంద, టమాట ఏసిన. నెల పదిహేను రోజులు ఇదే పని. కోసిన కూరగాయలను బండి మీద కమలాపూర్ కూరగాయల మార్కెట్కు తీసుకపోత. రోజుకు రూ.3 వేలు వత్తున్నయి. మా ఊరోళ్లందరు కూరగాయల కోసం మా చేను వద్దకే వస్తుంటరు.
ఇలాంటి సాయం ఏ సర్కారు చెయ్యలె
గతంలో వ్యవసాయాని కి సాయంచేసిన ప్రభుత్వా లు లేవు. తెలంగాణ వచ్చా క సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న పథకాలతో రైతుల తలరాతలు మారాయి. సబ్సిడీతో వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్లు ఇచ్చా రు. ఉచిత విద్యుత్తు ఇవ్వటంతోపాటు పుష్కలం గా నీరుండటంతో వ్యవసాయం పండుగలా మారింది. రైతుబంధు సాయంతో రైతులకు పెట్టుబడి కష్టాలు పోయినయ్.
పెట్టుబడి సాయంతో పండుగ
రైతులకు పెట్టుబడి సాయమందించి సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండు గ చేసిండ్రు. గత ప్రభుత్వాలేవీ రైతులను పట్టించుకోలే. రైతుబీమా పథకం ఎంతో మంది కుటుంబాలను ఆపన్నహస్తంలా ఆదుకుంటున్నది. పంటలేసే గడియకు ఇంతకుముందు డబ్బుల్లేక శానా ఇబ్బంది పడేది. ఇప్పుడు పెట్టుబడుల కోసం సర్కారు పైసలిస్తున్నది. ఎవరూ సౌకార్లను, వడ్డీ వ్యాపారులను డబ్బులు అడుగుతలేరు.