లింగంపేట, నవంబర్ 5: కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ఐలాపూర్కు చెందిన రైతు మామిడి చి న్న బీరయ్య అలియాస్ పాతింటి చిన్న బీరయ్య(56) గుండెపోటుతో మరణించారు. బీరయ్య.. పండిన ధాన్యాన్ని గత నెల 27న లింగంపేట మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాడు. వర్షం కురవడంతో రెండు రోజులుగా ధాన్యం తూకం నిలిపివేశారు. గురువారం రాత్రి ఇంట్లో భోజనం చేసి వచ్చి కొనుగోలు కేంద్రంలో పడుకున్నాడు. శుక్రవారం ఉదయం ధాన్యం కుప్పపై పడుకున్న బీరయ్య లేవకపోవడంతో స్థానికులు పరిశీలించి గుండెపోటుతో మృతి చెందినట్టు గుర్తించారు. మృతునికి భార్య పోశవ్వ, ఇద్దరు కుమారులు ఉన్నారు.