కోనరావుపేట : అనారోగ్యంతో బాధపడుతూ రైతు ఉరివేసుకుని ఆత్మహత్య ( Farmer suicide) చేసుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల( Siricilla ) జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది.
పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం. గ్రామానికి చెందిన పని బాబు(53) అనే వ్యక్తి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నాలుగు సంవత్సరాలుగా ఆయన దీర్ఘకాలిక వ్యాధులతో ( Illness ) పాటు నరాల బలహీనతో తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు.
దీంతో ఆరోగ్యం సహరించకపోవడంతో మనోవేదన చెందిన బాబు శనివారం తెల్లవారుజామున ఇంటి ముందు ఉన్న పశువుల పాకలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
మృతుడికి భార్య వసంత, ఇద్దరు కుమారులు ప్రశాంత్, ప్రవీణ్ ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.