బాంబోలిమ్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ (హెచ్ఎఫ్సీ)కు చుక్కెదురైంది. మంగళవారం జంషెడ్పూర్ ఎఫ్సీతో జరిగిన మ్యాచ్లో హెచ్ఎఫ్సీ 0-3 తేడాతో ఓటమిపాలైంది. చింగ్లేన్సనసింగ్ (5ని, ఓన్గోల్), హార్టె (28ని), చింక్వు(65ని) గోల్స్ చేశారు. ఈ విజయంతో 37 పాయింట్లు ఖాతాలో వేసుకున్న జంషెడ్పూర్ సెమీఫైనల్ బెర్తు ఖాయం చేసుకుంది. మరోవైపు వరుస విజయాలతో ఇప్పటికే సెమీస్లో నిలిచిన హైదరాబాద్ (35) రెండో స్థానంలో ఉంది. మిగిలిన రెండు సెమీస్ బెర్తుల కోసం ఏటీకే మోహన్బగాన్ (34), డిఫెండింగ్ చాంపియన్ ముంబై సిటీ ఎఫ్సీ (31), కేరళ బ్లాస్టర్స్ ఎఫ్సీ (30) మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇదిలా ఉంటే తమ ఆఖరి మ్యాచ్లో ఈనెల 5న ముంబైతో హైదరాబాద్ తలపడనుంది.