శాయంపేట, నవంబర్ 18: హనుమకొండ జిల్లా శాయంపేట మండలం లోని పలు గ్రామ పంచాయతీల్లో నకిలీ అధికారి గురువారం హల్చల్ చేశాడు. విజిలెన్స్ అధికారినంటూ తనిఖీలు చేశాడు. శాయంపేట మండలం పెద్దకోడెపాక, మైలారం, జోగంపల్లి, గంగిరేణిగూడెం పంచాయతీలకు వెళ్లిన నకిలీ అధికారి పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్లను హడలెత్తించాడు. పల్లెప్రగతిలో చేపట్టిన పనులకు సంబంధించిన రికార్డులను చూపాలని అనడంతో కార్యదర్శలు వాటిని అందజేయగా పరిశీలించాడు.
గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు ఏమిటీ?, ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? సర్పంచ్లపై అం టూ ఫైర్ అయ్యాడు. తనకు ఖర్చులు ఉంటాయని, డబ్బులు ఇవ్వాలని అడిగినట్టు చెప్పారు. మండల అధికారుల కు విషయం తెలియడంతో ప్రభు త్వం నుంచి అధికారి ఎవరూ పంచాయతీలకు రాలేదని చెప్పారు. ఆరా తీయడంతో సదరు వ్యక్తి పేరును సుమన్ అని చెప్పినట్టు తెలిసింది.
నకిలీ అధికారా?, ప్రభుత్వ అధికారా? గుర్తించకుండానే రిజిస్టర్లను అందజేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. నకిలీ అధికారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏ మాత్రం అనుమా నం వచ్చినా 100 నంబర్కు డయల్ చేయాలని కార్యదర్శులు, సర్పంచ్లకు ఎంపీడీవో కృష్ణమూర్తి సూచించారు. పెద్దకోడెపాక జీపీలో సీసీ కెమెరాలో నకిలీ అధికారి బాగోతం రికార్డు అయిందని పుటేజీని పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.