మక్తల్ రూరల్, డిసెంబర్ 5 : ఉమ్మడి జిల్లాలో ఎంతో ప్రసిద్ధి చెందిన పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవా లు ఈనెల 18 నుంచి ప్రారంభమవుతుండడంతో ఉత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించా రు. ఆదివారం పట్టణంలో ఆయన స్వగృహంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వాల్పోసర్లను ఎమ్మెల్యే విడుద ల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలకు ముంబయి, షోలాపూర్, అమర్నాథ్, కర్ణాటకలోని రాయిచూర్, గుల్బర్గ, యాదగిరి, హైదరాబాద్ వంటి పట్టణాల నుంచి వేలాది మంది భక్తులు హాజరవుతారని పేర్కొన్నారు. ఉత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా మా స్కులు ధరించాలని ఆయన సూచించారు. కొవిడ్ నిబంధ నలు పాటించాలన్నారు. ఆలయ పరిసరాల్లో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం, వైద్య సదుపాయా లు కల్పించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఆలయ ట్రస్ట్ చైర్మన్ భీమాచార్య మాట్లాడుతూ పడమటి ఆంజనేయస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈనెల 17న ధ్వజా రోహణంతో ప్రారంభమవుతాయని, 18న ప్రభోత్స వం, 19న రథోత్సవం, 20న పాల ఉట్ల ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తామన్నారు.
సీఎం సహాయ నిధి చెక్కు పంపిణీ
పట్టణంలో కృష్ణ మండలం ముడుమాల గ్రామానికి చెం దిన నాగేందర్కు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన రూ:27,500 చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రాజేశ్గౌడ్, మాగనూర్ జెడ్పీటీసీ వెంకటయ్య, ఆలయ ఈవో సత్యనారాయణ, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శ్రీనివాస్గుప్తా, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు శంషొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.