సమస్యలు ఉన్న వారికి ఉచిత ఆపరేషన్లు
ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు
సిద్దిపేట, జూన్ 7 : కంటి సమస్యలతో బాధపడుతూ చికిత్స లేని కారణంగా కంటి చూపునకు ఏ ఒక్కరు దూరం కావద్దనే లక్ష్యంతో ప్రత్యేక కంటి వైద్య శిబిరాలు పెట్టి అవసరమైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయిస్తున్నట్లు ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. మంగళవారం ప్రజాప్రతినిధులు, అధికారులు, డీఎంహెచ్వో కాశీనాథ్, మున్సిపల్ చైర్మన్ కడవేర్గు మంజుల, వైస్ చైర్మన్ కనకరాజు, వార్డు నోడల్ ఆఫీసర్లు, వార్డు స్థాయి టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులతో కంటి క్యాటరాక్టు ఆపరేషన్లు, మోకాలి చిప్ప ఆపరేషన్లు, పట్టణ ప్రగతి, హరితహారం, స్వచ్ఛ సర్వేక్షన్ తదిదర అంశాలపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ కంటి సమస్యలతో బాధపడుతున్న వారిని క్షేత్రస్థాయిలో గుర్తించాలన్నారు.
వార్డుల్లో క్యాంపులు పెట్టి, వైద్య సేవలందించాలని సూచించారు. సిద్దిపేట పట్టణాన్ని స్వచ్ఛ, సుందర పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చేపట్టిన పట్టణ ప్రగతిని విజయవంతం చేయాలన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలన్నారు. పచ్చదనం పెంచేందుకు యుద్ధ ప్రాతిపదికన ప్రతీ వార్డుల్లో కార్యాచరణ రూపొందించి, పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు సన్నాలు చేయాలని సూచించారు. పేదలపై భారం పడకుండా ఉచితంగా మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్లు సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ దవాఖానలో చేయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. వార్డుల్లో దీనిపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో సిద్దిపేట మెరుగైన ర్యాంకు సాధించేలా అన్ని విభాగాలు ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని వార్డుల కౌన్సిలర్లు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హుస్నాబాద్కు ఎంసీహెచ్
రూ.10కోట్లతో 50 పడకలతో నిర్మిస్తాం
నిత్యాన్నదాన సత్రానికి నెల వేతనం విరాళం
హుస్నాబాద్ రూరల్, జూన్ 7: హుస్నాబాద్లో రూ. 10కోట్లతో 50 పడకల మాతా శిశుసంక్షేమ దవాఖానను ఏర్పాట్లు చేయనున్నట్లు మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని పందిల్ల గ్రామంలో స్వయంభూ రాజేశ్వర ట్రస్ట్ వాసవి నిత్యాన్నదాన సత్రాన్ని స్థానిక ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్తో కలిసి మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పందిల్లలో నిత్యాన్నదాన సత్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పది మందికి ఉపయోగపడేలా సేవలు అందిస్తున్న వాసవి నిత్యాన్నదాన సత్రానికి ఒక నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.
హుస్నాబాద్ దవాఖానలో అన్ని రకాల వైద్యసేవలు అందుబాటులోకి వచ్చేలా అవసరమైన వైద్యులను నియమించి, పరికరాలు అందించి అన్ని సేవలు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. హుస్నాబాద్లో ఉచిత డయాలసిస్ సేవలను ప్రారంభిస్తామన్నారు. హుస్నాబాద్ దవాఖాన పాత భవనానికి రూ.2 కోట్లతో మరమ్మతులు చేయించి, త్వరలోనే వినియోగంలోకి తెస్తామన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఏఎన్ఎం సబ్సెంటర్కు రూ. 20లక్షల చొప్పున నిధులు కేటాయిస్తూ వాటిని పల్లె దవాఖానలుగా మార్చనున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే నియోజకవర్గంలోని అన్ని తండాలకు తారురోడ్లు మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీచైర్మన్ రోజాశర్మ, టీటీడీ బోర్డ్ మెంబర్ మురంశెట్టి రాములు, జడ్పీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, ఎంపీపీ లకావత్ మానస, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత, సర్పంచ్ తోడేటి రమేశ్, వైస్ చైర్మన్ అయిలేని అనిత, మార్కెట్ కమిటీ చైర్మన్ కాసర్ల అశోక్బాబు తదితరులు పాల్గొన్నారు.